వనపర్తి జిల్లాలో ఆరు గొర్రెలు మృతి

by Naveena |   ( Updated:2024-10-10 11:56:21.0  )
వనపర్తి జిల్లాలో ఆరు గొర్రెలు మృతి
X

దిశ, రేవల్లి: వనపర్తి జిల్లాలో విద్యుత్ షాక్ తో ఆరు గొర్రెలు మృతి చెందాయి. రేవల్లి మండల పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన దొడ్డి కురుమయ్య అనే రైతుకు చెందిన ఆరు గొర్రెలు విద్యుత్ షాక్ తో చనిపోయాయి. వివరాల ప్రకారం.. గౌరీ దేవి పల్లి గ్రామం పక్కన మధుసూదన్ రెడ్డి అనే పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర వర్షం పడింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ షాక్ వచ్చి.. అక్కడికక్కడే 6 గొర్రెలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. అదేవిధంగా సుమారుగా 85 వేల నుంచి 90 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని రైతు కంటతడి పెట్టుకున్నాడు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed