ఉప్పొంగిన సరళమ్మ .. తెరుచుకున్న ఆటోమెటిక్ సైఫన్లు

by Kavitha |
ఉప్పొంగిన సరళమ్మ .. తెరుచుకున్న ఆటోమెటిక్ సైఫన్లు
X

దిశ, మదనాపురం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం గాలి పీడనం ద్వారా నాలుగు ఉడ్ సైఫన్లు, రెండు ప్రైమరీ సైఫన్ తెరుచుకొని సుమారు నీటిని దిగువకు విడుదల చేస్తూ పర్యాటకులను కనువిందు చేసింది. అదేవిధంగా మదనాపురం రైల్వేగేటు సమీపంలో మారెడ్డిపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో.. కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత, మక్తల్ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలించిన రామన్‌ పాడు ప్రాజెక్టు అధికారులు, ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏ ఈ రెనాల్ రెడ్డి తెలిపారు. ఆత్మకూర్ అమరచింత మక్తల్ నర్వ మండలాలకు వెళ్లే ప్రయాణికులు రామన్పాడ్ ప్రాజెక్టు మీద వెళ్ళవలసిందని ఎస్సై శేఖర్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed