farmers protest : కరెంట్ కోతల పై సబ్ స్టేషన్ ముందు రైతుల ఆందోళన...

by Sumithra |
farmers protest : కరెంట్ కోతల పై సబ్ స్టేషన్ ముందు రైతుల ఆందోళన...
X

దిశ, ఊర్కొండ : జకినాల పల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత నెల రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఊర్కొండ పేట గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఊర్కొండ పేట గ్రామస్తులు. బొల్గం యాదయ్య గౌడ్, ఆంచోజు రాజేష్ చారి, తిరుమోని బాలరాజ్ గౌడ్, కొండల్ గౌడ్, అశోక్ రెడ్డి, ఎండి అక్బర్, మోటపురం ఆంజనేయులు, ఎండి యూసఫ్, చందు, అరవింద్ గౌడ్ తదితరులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.



Next Story