అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

by Sridhar Babu |
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
X

దిశ,అలంపూర్ టౌన్ : అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సురేఖకు పాలక మండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈఓ పురేందర్, అర్చకులు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున తెచ్చిన పట్టు వస్త్రాలను అందజేశారు. కుంకుమార్చన చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed