నరేంద్ర మోడీ నాయకత్వం పేద ప్రజల సంక్షేమం : భరత్

by Disha Web Desk 23 |
నరేంద్ర మోడీ నాయకత్వం పేద ప్రజల సంక్షేమం : భరత్
X

దిశ,ఇటిక్యాల : పార్లమెంట్ ఎన్నికల విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండల కేంద్రలల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం ఏ పథకాలు అవసరం అయితాయో ఆ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి ఇళ్ల సాకారం కోసం పీయం ఆవాస్ యోజన తో వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రణాళిక రూపొందించారన్నారు.వచ్చే ఐదేళ్లు ఉచితంగా రేషన్ పంపిణీ మోడీ చేస్తారన్నారు.నాగర్ కర్నూల్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసుకోవాలంటే కమలం పువ్వు గుర్తుపై ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed