కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి గ్రామపంచాయతీ ఎక్కడో తెలుసా?

by Kalyani |
కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి గ్రామపంచాయతీ ఎక్కడో తెలుసా?
X

దిశ, గోపాల్పేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొదటిసారిగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పరిధిలోని ఓ తండాను నూతన గ్రామ పంచాయతీగా ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగింది. తండా వాసుల వివరణ ప్రకారం… మండల పరిధిలోని జింకల బిడు తండాను నూతన గ్రామపంచాయతీగా గ్రామ ప్రజలకు ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గోపాల్పేట్ ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్య శిలా రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగినందుకు తండా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్, లాలు నాయక్, గౌడ్ నాయక్, పులియా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed