MLA : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

by Kalyani |
MLA : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
X

దిశ,దేవరకద్ర : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర మండలం లోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటకు కోసం కుడి, ఎడమ కాలువల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ను నిర్మించి 60 ఏళ్లు గడుస్తున్న చెక్కు చెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి, కుంగి పోయిందన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజా సంపద కొల్ల గొట్టిందన్నారు. ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలకు కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజల్ రెడ్డి, మాజీ జడ్పీటిసి లక్ష్మీకాంత్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed