పాముకాటుతో బాలుడు మృతి

by Nagam Mallesh |
పాముకాటుతో బాలుడు మృతి
X

దిశా, ఇటిక్యాలఃపాముకాటుకు గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని గోపల్ దిన్నె గ్రామంలో చోటుచేసుకుంది.ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని రేపల్లె గ్రామానికి చెందిన బోయ బజారి తన కుటుంబంతో కలిసి బ్రతుకు తెరువు కోసం అమ్మమ్మ గారి గ్రామము గోపల్ దిన్నేలో గుడిసె వేసుకొని పది సంవత్సరాలుగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం 10 గంటల సమయంలో భోజనం చేసి నిద్రించగా రాత్రి 11 గంటలకు 30 నిమిషాల సమయంలో కుమారుడు ( 9 )సంవత్సరాల వేణుగోపాల్ తండ్రిని లేపి నాన్న నాకు వాంతులు అవుతున్నాయి నీళ్లు తాగుతానని చెప్పగా తండ్రి కుమారునికి నీళ్లు తెచ్చి తాపించాడు. అయితే మంచం కింద పాము కనిపించడంతో తన కుమారుణ్ణి పాము కాటు వేసింది అన్న అనుమానంతో వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని మృతి చెందిన బాలుడి తండ్రి బజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed