ప్రజావాణి సమస్యలు అన్ని పరిష్కరించాలిః కలెక్టర్ సిక్తా పట్నాయక్

by Nagam Mallesh |
ప్రజావాణి సమస్యలు అన్ని పరిష్కరించాలిః కలెక్టర్ సిక్తా పట్నాయక్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రజావాణి సమస్యలు అన్ని పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ సమావేశం హాల్ లో జిల్లా అధికారులతో కాడ, గ్రీవెన్స్ గురించి సమీక్ష నిర్వహించారు. కాడ గ్రీవెన్స్ డే కి వచ్చి ఫిర్యాదులను అన్ని శాఖల అధికారులు పరిష్కరించాలన్నారు. జాబ్ గురించి పెండింగ్ గ్రీవెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్, ఇరిగేషన్, గురుకుల, పంచాయతీరాజ్ ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు, పబ్లిక్ గురించి వచ్చే అర్జీలు ఆయా శాఖల నుండి పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ ఎక్కువగా వచ్చిన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారికి వచ్చిన అర్జీలను తెలుసుకున్నారు.

Next Story

Most Viewed