ప్రజావాణికి 20 ఫిర్యాదులు

by Naveena |
ప్రజావాణికి 20 ఫిర్యాదులు
X

దిశ,గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సమర్పించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మీనారాయణతో కలసి కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడుn పరిశీలన జరుపుతూ.. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story