పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా అమిత్ షా

by Satheesh |
పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన అమిత్ షా.. తెలంగాణ సాయుధ పోరాటయోధులకు, సర్ధార్ వల్లభభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు. అనంతరం అమిత్ షా సైనిక వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రాష్ట్ర బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed