వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి

by Sridhar Babu |
వనమహోత్సవ లక్ష్యాలను  పూర్తి చేయాలి
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలకు సంబంధించి మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. 2024-2025 సంవత్సరానికి వన మహోత్సవ జిల్లా లక్ష్యం 65 లక్షల 14 వేలు కాగా లక్ష్యాలను అధిగమించేందుకు జిల్లా అధికారులు శాఖల వారీగా ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు జిల్లాలోని అటవీ శాఖ నర్సరీ నుండి మొక్కలు తీసుకొనుటకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించే లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటడంతోపాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు.

ప్రతి పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు, చింత, ఉసిరి, వెలగ మొక్కలు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని కాలువలకు ఇరువైపులా సుబాబుల మొక్కలను నాటాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యా చందన, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed