- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సీతారామ ప్రధాన కాలువకు భారీ గండి
by Mahesh |
X
దిశ, ములకలపల్లి: గోదావరి పై నిర్మించిన సీతారామా ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వాగులు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా ములకలపల్లి మండలం వీకే రామవరం పంప్ హౌస్ 2 సమీపంలో ఈ గండి పడి నీరు బయటకు ప్రవహిస్తుంది. దీంతో కాలువ కింద ఉన్న పంట భూములు నీటి ప్రవాహానికి గురై కొట్టుకుపోయాయి. ప్రధాన కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యతను ఈ ఘటన ప్రశ్నించేలా ఉందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు పడిన గండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Advertisement
Next Story