మూడో అంతస్థు నుంచి పడి విద్యార్థి మృతి!

by karthikeya |
మూడో అంతస్థు నుంచి పడి విద్యార్థి మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రయివేట్ జూనియర్ కళాశాల మూడో అంతస్తుపై నుండి పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వైరా రోడ్ పోలీసు లైన్‌లో ఉన్న ఎస్‌ఆర్ కాలేజ్ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది. జూన్ నుండి ఇప్పటివరకూ వేర్వేరు కారణాలతో ఇదే క్యాంపస్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రమాదాల బారిన పడడం మిగిలిన విద్యార్థులతో పాటు స్థానికంగా తీవ్ర కలకల రేపుతోంది. ఇక మృతుడిని కోదాడ దగ్గర గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టిపల్లి లోకేష్ (16)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నా జూనియర్ కళాశాల యాజమాన్యం తమ బిడ్డను కాపాడలేదని, కనీసం కాల్ చేసినా రెస్పాండ్ కాలేదని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. చేతికొచ్చిన బిడ్డ కడతేరడంతో ఆ కుటుంబం మొత్తం కన్నీరుమున్నీరవుతోంది. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story