ప్రజా సమస్యలను ముందుగానే పరిష్కరించాలి

by Sridhar Babu |
ప్రజా సమస్యలను ముందుగానే పరిష్కరించాలి
X

దిశ,మణుగూరు/పినపాక : ప్రజా సమస్యలను అధికారులు ముందుగానే పరిష్కరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని

అధికారులని ఆదేశించారు. అనంతరం సింగిరెడ్డిపల్లి కల్వర్టును పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, అర్జున్, శంకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed