వెన్నెలనగర్ లో సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
వెన్నెలనగర్ లో సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, కొత్తగూడెం : వెన్నెలనగర్ లో సమస్యలు పరిష్కరించాలని ఆ స్థల లబ్ధిదారులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ్ కొత్తగూడెం...సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో నిరుపేదలకు 75 గజాల చొప్పున ప్రభుత్వం స్థలం ఇచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ స్థలం అప్పగించి చేతులు దులుపుకున్నారని అన్నారు.

ఇక్కడి నీటి సరఫరా, విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకే విడతలో అందరికీ ఎలాంటి కండీషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేసేందుకు పాలకవర్గంలో తీర్మానం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖాదర్, మస్తాన్ అలీ, సుజాత, రాజేష్, మల్లేష్, నరసమ్మ, నూర్జహాన్, కమల, రెహమాన్, శంషుద్దీన్ పాల్గొన్నారు.

Next Story