పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యంః పొంగులేటి

by Nagam Mallesh |
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యంః పొంగులేటి
X

దిశ,ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి 169 మంది లబ్ధిదారులకు రామ్ లీలా ఫంక్షన్ హాల్లో రూ.50లక్షల విలువ చేసే చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.పేదల ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు నిధులు విడుదల చేయకుండా బీఆర్ఎస్ సర్కారు తాత్సారం చేసిందన్నారు. అరంతకం గురువారం రాత్రి నిర్వహించిన బంజారాల తీజ్ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, నాయకులు రామ్మూర్తి నాయక్, తమ్మినేని నవీన్, అంబటి సుబ్బారావు, భుజంగ రెడ్డి, వీరారెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, రవి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed