- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేను పక్కా లోకల్...
దిశ, ములకలపల్లి : తాను పక్కా లోకల్ అభ్యర్థినని, ఈ గడ్డ బిడ్డగా ఇక్కడి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. తన స్వగ్రామమైన తిమ్మంపేట గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వినోద్ రావుకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ముల్కలపల్లిలో జరిగిన రోడ్ షో లో ప్రసంగిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఈ భూమి పుత్రుడిగా తాను పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ గడ్డ బిడ్డగా మీ అభివృద్ధికి తనది భరోసా అని, మీరు జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేస్తే తిమ్మంపేట లో ఉన్న మా ఇంట్లో వాళ్లకు కూడా వినిపిస్తుంది అని, ఈ ప్రాంతం వాడినైన తనకు ఇక్కడి సమస్యలు తెలుసన్నారు. మీరు దీవించి ఢిల్లీ పంపిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా లొంగవద్దని ఓటర్లను అభ్యర్థించారు.
మోడీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క మంచి విద్యా కేంద్రం కానీ, ఆసుపత్రి కానీ, పరిశ్రమ కానీ ఈ ప్రాంతానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే ములకలపల్లి ని దేశంలో ఉత్తమమైన మండలంగా, ఖమ్మం నియోజకవర్గాన్ని అగ్రగామిగా మారుస్తానని అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం అభివృద్ధి బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు పట్టలేదని విమర్శించారు. దేవుడ్ని, ధర్మాన్ని, అభివృద్ధిని ఆ పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ రోడో షో లో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు రంగా కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, నియోజకవర్గ కన్వీనర్ దుర్గా శ్రీనివాస్, పార్లమెంటు కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మద్దాల దేవి, ములకలపల్లి మండల ఇన్చార్జ్ వాసం పోలయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముసలయ్య, మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకట అప్పారావు, ప్రధాన కార్యదర్శులు సీతారాములు, శంకర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.