దేశ రక్షణ మోడీతోనే సాధ్యం

by Disha Web Desk 15 |
దేశ రక్షణ మోడీతోనే సాధ్యం
X

దిశ, ఖమ్మం టౌన్ : దేశ రక్షణ మోడీతోనే సాధ్యమని, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ఆర్యవైశ్యులు ఐక్యంగా పోరాడాలని ధర్మ రక్షణ ఫౌండర్ చీకోటి ప్రవీణ్ పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు గెలుపును కాంక్షిస్తూ ఆదివారం నగరంలో వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ దేశాలలో భారతవాణిని అగ్రగామిగా నిలుపుకోవడం కోసం భారతదేశంలో సుస్థిర, శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ లాంటి వ్యక్తులు ప్రధానిగా ఉండడం ఎంతో అవసరం అన్నారు. తాండ్ర వినోద్​రావు లాంటి వ్యక్తులను

పార్లమెంటుకు పంపిస్తే జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, మోడీ నాయకత్వంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇక తిరిగి దేశంలో మరోసారి మోడీ గెలుపు ఖాయమన్నారు. తాండ్ర వినోద్​రావు మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇస్తే జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతానని, గతంలో ఎన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినా జిల్లా అభివృద్ధి కోసం ఎవరు పని చేయలేదని, మోడీ నాయకత్వంలో నాకు అవకాశం ఇస్తే జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తాండ్ర వినోద్​రావు సతీమణి వినీలారావు, ఆర్యవైశ్య సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, వేణుగోపాల్, సన్నే ఉదయ ప్రతాప్, వెంకట్ గుప్తా పాల్గొన్నారు.

Next Story

Most Viewed