పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంః ఎమ్మెల్యే రాగమయి దయానంద్

by Nagam Mallesh |
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంః ఎమ్మెల్యే రాగమయి దయానంద్
X

దిశ,సత్తుపల్లి : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయం అని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బుధవారం " సీఎం రిలీఫ్ ఫండ్ " 106 చెక్కులు రూ.31,94,000, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, చెక్కులు 91 మందికి గాను లబ్ధిదారులుకు రూ.92,10,556 చెక్కులు లబ్ధిదారులకు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన, పేదల సంక్షేమానికి పనిచేస్తుందని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మార్వో యోగేశ్వరరావు, ఆర్ ఐ జానమియా, ఆర్ ఐ.నరేష్, ఆఫీస్ సిబ్బంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, కౌన్సిలర్స్ దూదిపాల రాంబాబు, కంటే నాగలక్ష్మి, పద్మా జ్యోతి,గ్రాండ్ మౌలాలి, నాగుల్ మీరా, కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు శివా వేణు, ఎండి కమల్ పాషా,సత్తుపల్లి పట్టణం, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు, లబ్ధిదారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed