- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విలీనం కోసం ఇంకా ఎదురు చూపేనా.. మరోసారి ముఖ్యమంత్రుల భేటీ..?
దిశ, భద్రాచలం: ఆరో తేదీ గురించి ఎంతో ఆశతో ఎదురు చూసిన భద్రాచలం పట్టణ ప్రజలతో పాటు ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలకు మళ్లీ అదే అనుభవం ఎదురైంది. ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి చర్చలలో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, పోలవరం ముంపు పేరుతో ఆంధ్రలో విలీనం చేసిన ముంపుకు గురికాని పిచ్చుకలపాడు, కన్నాయుగూడెం, ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల పంచాయతీలను తెలంగాణా భద్రాచలంలో కలపడానికి మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ ముఖ్యమంత్రుల చర్చలు పొడిపొడిగా సాగడంతో ఐదు పంచాయతీల విలీనంపై స్పష్టత లేకుండా పోయింది. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేసి రాష్ట్ర విభజన నాటి సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
మరోసారి భేటీ..?
రాష్ట్ర విభజన నాటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు కాబోయే రెండు కమిటీలు నివేదిక అనంతరం మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బేటీ అయ్యే అవకాశం ఉంది. సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అవగాహనకు వచ్చాక వారి నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖకు తెలియపరుస్తారు. అప్పుడే ఆంధ్రాలో విలీనం అయిన పోలవరం ముంపుకు గురికాని ఐదు పంచాయతీలు తెలంగాణాలో కలిసే అవకాశం ఉంది.
కలిసిరాని జూలై..
గ్రామాలను విలీనం చేసే పోలవరం ఆర్డినెన్స్ను 2014 జూలైలో పార్లమెంట్ అంగీకరించింది. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లకు ఆంధ్ర, తెలంగాణా ముఖ్య మంత్రులు విభజన నాటి సమస్యల పరిస్కారం కోసం చర్చించడానికి మళ్లీ జూలైలోనే కలిశారు. ఆరోజు తెలంగాణా లోని ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనం కారణంగా భద్రాచలం పట్టణం చాలా నష్టపోయింది. ఇద్దరు ముఖ్య మంత్రులు కలయిక ద్వారా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకుంటే... చర్చలు చప్పగా సాగాయి. పై రెండు సంగటనలు కాకతాలీయంగా జూలైలోనే జరగడంతో ఈ ప్రాంత వాసులకు జూలై నెల కలిసి రాలేదని అనుకుంటున్నారు.
ముంపునకు గురికాకపొయునా ఎందుకు కలిపారు..
పోలవరం కారణంగా ముంపునకు గురయ్యే జాబితాలో లేని కన్నాయిగూడెం, పిచ్చుకుల పాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం పంచాయతీలను అధికారులు కావాలనే ఆంధ్రాలో విలీనం చేశారు. ఎందుకంటే ముంపు వాసులకు పునరావాసం కల్పించేందుకు ఈ పంచాయతీలను ఆంధ్రలో విలీనం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఐదు పంచాయతీల పాలన ఆంధ్రా ప్రభుత్వానికి భారమే అయినా.. పోలవరం ముంపు భాధితులకు పునరావాసం కల్పించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రా ప్రభుత్వం ఈ పంచాయతీలను వదులుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకోక పోవచ్చు. అయితే ఆయా పంచాయతీల ప్రజలు భారీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది.