బ్యాలెట్‌లో గుడ్డు గుర్తు ఉంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి : బండి సంజయ్

by Disha Web Desk 23 |
బ్యాలెట్‌లో  గుడ్డు గుర్తు ఉంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి : బండి సంజయ్
X

దిశ, హుజురాబాద్ : జమ్మికుంట లో సోమవారం బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా యువ సమ్మేళనం కార్యక్రమం జరిగింది.దీనికి తమిళ నాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బండి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తనకు ఓటు వేయాలంటే కమలం గుర్తు చూపిస్తున్నా నని,కానీ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలంటే గుడ్డు గుర్తు వేయాలని సీఎం ప్రతి మీటింగ్ లో చూపిస్తున్నారని, ఎన్నికల బ్యాలెట్ లో గుడ్డు గుర్తు ఉంటే దానికి ఓటు వెయ్యండి లేకపోతే కమలం గుర్తు వేయాలని కాంగ్రెస్ కార్య కర్తలకు సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్ల నేడు ఆ పార్టీ 3 వ స్థానానికి గ్రాఫ్ పడిపోయిందని,కాంగ్రెస్ నాయకులు మోడీ,అమిత్ షా,నడ్డా లతో పాటు రాముల వారిని,అక్షింతలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని,వారిని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని కోరారు.రానున్న ఎన్నికల్లో 12 సీట్లు గెలువ పోతున్నామని,తర్వాత కాంగ్రెస్ కు సీఎం సీటు ఉండదని అన్నారు.ప్రజా సమస్యలపై బీజేపీ పార్టీ పోరాటం చేసిందని,మనకు అధికారం రావాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ లను నమ్మి ప్రజలు ఓటు వేశారని,వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని,ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి ఓటు వేస్తారని ఆయన జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed