కొడుకు మృతి.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

by Nagam Mallesh |
కొడుకు మృతి.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
X

దిశ, శంకరపట్నంః శంకరపట్నం మండలంలోని మెట్ పల్లి గ్రామంలో బుధవారం మానసికస్థితి బాగాలేని ఓ వ్యక్తి మృతి చెందగా అతని తల్లి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు బావిలో శవమైంది. వివరాల్లోకి వెళితే.. మెట్టుపల్లి గ్రామంలో గడ్డి కనకమ్మ (70) కీ ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కాగా పెద్ద కుమారుడు సంపత్ కు వివాహం చేసి చిన్న కుమారుడైన రాజయ్య మానసిక వికలాంగునితోనే తల్లి జీవించేది. ఆరు నెలల క్రితం భర్త గడ్డి మల్లయ్య అనారోగ్యంతో మరణించాడు. బుధవారం తెల్లవారుజామున మానసిక స్థితి బాగాలేని కుమారుడు గడ్డి రాజయ్య(43) కూడా మరణించాడని స్థానికులు తెలిపారు. తల్లి ,కుమారుడు ఇరువురు కలిసి జీవించే వారని కొడుకు మరణంను తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇంటికి దగ్గరలో గల ఓ వ్యవసాయ బావిలో దూకినట్లు ఆనవాలు చూసి ఆ బావిలోని నీరును వ్యవసాయ పంపు సెట్లు పెట్టి

తోడేసి చూడగా మృతదేహం కనిపించిందని, మృతురాలి కుమారుడు తెలిపాడు. తండ్రి ,తమ్ముడు చనిపోవడంతో మానసిక వేదనకు గురై తమ తల్లి ఆత్మహత్య చేసుకుందని మృతురాలు పెద్ద కుమారుడు గడ్డి సంపత్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై కొత్తపల్లి రవి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed