ఐదు సంవత్సరాలు సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు : కొప్పుల ఈశ్వర్

by Aamani |
ఐదు సంవత్సరాలు సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు : కొప్పుల ఈశ్వర్
X

దిశ,పెద్దపల్లి : ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల పదవి కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల పదవి విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల మాట్లాడుతూ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఉప సర్పంచ్ ల పదవులకు మాత్రమే విరమణ, ప్రజా సేవకు కాదన్నారు.

ప్రజా ప్రతినిధులుగా అవకాశాలు రావడమే గొప్ప విషయం, ప్రజాప్రతినిధులు కావడం అదృష్టమని, వచ్చిన అవకాశాన్ని గౌరవించి ఐదు సంవత్సరాలు ప్రజల సేవల్లో పని చేస్తారో వారే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ప్రజలతో ఎన్నికైన వ్యక్తిని సరైన సేవలు అందించానని తెలుసుకుంటారో వారే నిజమైన ప్రజా సేవకులని, గత కెసిఆర్ పాలనలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో, పార్టీ ఉంటే ప్రజలకు ప్రాంతానికీ మంచి జరుగుతుందని, స్వార్థం ఉంటుందని, అందుకే మన పార్టీ గెలవాలి అనుకుంటాం అన్నారు. గెలుపు ఓటములు సర్వసాధారణం, పార్టీ ఓటమి చెంది ఉన్నదని, ఈ సమయంలో కొంత మంది పార్టీ మారుతున్నారని, పార్టీ మారితే వాళ్ళ ఉన్న విలువలు తగ్గుతాయని, కానీ బీఆర్ఎస్ ఏ విధమైన నష్టం లేదన్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed