- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చీకట్లో పల్లె దవాఖాన.. కనీస సౌకర్యాల లేమి
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మెట్టు పల్లి గ్రామంలో ఉన్న పల్లెదావఖానాలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆశాలు సతమతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే మెట్పల్లి గ్రామంలో గల పల్లె దవఖాన ఏర్పాటు అయ్యి దశాబ్దకాలం దాటిన నేటికీ విద్యుత్ సదుపాయానికి నోచుకోలేదు.దీనితో ఆశా వర్కర్లు ,పనిచేయాలంటే వెలుతురును వెతుక్కోవాల్సిందే సరైన వెంటిలేషన్ లేకపోవడంతో ఉన్న గదులు చీకటిగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించు కున్నప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. అంతేకాకుండా పల్లె దవాఖాన లో కనీస సౌకర్యాలైన టాయిలెట్స్ లేకపోవడం మరి దారుణం. దీంతో దావఖాన కు వచ్చే పేషెంట్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు,ఇట్టి విషయాన్ని మండల వైద్యాధికారి నీ వివరణ అడగగా టాయిలెట్స్ లేని మాట నిజమేనని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.