డీసీసీ అధ్యక్షులు కొమ్మూరికి నిరసన సెగ.. సొంత పార్టీ నేతలే..

by Aamani |
డీసీసీ అధ్యక్షులు కొమ్మూరికి నిరసన సెగ.. సొంత పార్టీ నేతలే..
X

దిశ,జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ సముదాయంలో జరుగుతున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతున్న ఈ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో వేదిక పైకి జనగామ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్టేజి మీదకి వెళ్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మీరు పైకి ఎందుకు ఎక్కతున్నారో చెప్పాలని అధికారంగా జరుగుతున్న కార్యక్రమంలో నీకు హక్కు ఎక్కడిదని స్వంత కాంగ్రెస్ పార్టీ నేతలే అడ్డుకోవడం జరిగింది.కొద్దిసేపు కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అందరికీ సర్దిచెప్పి సముదాయించారు.

Advertisement

Next Story

Most Viewed