- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొప్పుల ఈశ్వర్ గెలుపు దిశగా పనిచేయాలి : పుట్ట మధూకర్
దిశ,మంథని : పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజాగృహా లో మంథని నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి పార్లమెంటు ఎన్నికల్లో భీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు దిశగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగుమాసాల్లో జరిగిన స్థితిగతులపై ప్రజలకు వివరించాలని, అబద్దాలు,మోసపూరిత కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రతి నాయకుడు కార్యకర్తలా కష్డపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని,ఆ దిశగా ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి గెలిపించేలా కృషి చేయాలని ఆయన సూచించారు.