కరీంనగర్ బైపాస్ లో భారీగా గంజాయి పట్టివేత … ముగ్గురిపై కేసు నమోదు

by Kalyani |
కరీంనగర్ బైపాస్ లో భారీగా గంజాయి పట్టివేత … ముగ్గురిపై కేసు నమోదు
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శనివారం బైపాస్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏపీ 31 బిహెచ్ 2925 నెంబర్ గల స్విఫ్ట్ కారులో 70 కిలోల గంజాయి గుర్తించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. కారులో ఉన్న ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఒడిశా నుంచి మహారాష్ట్ర కు తరలిస్తున్నట్లు తెలిపారున్నారు. నిందితుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురిపై

ఏ1. విశాఖ జిల్లా కొమ్మాది కి చెందిన సెరకనం రామకృష్ణ(51)

ఏ2. కాకినాడ జిల్లా కిర్లంపూడి కి చెందిన దొడ్డి మణికంఠ (39)

ఏ3. మహారాష్ట్ర జిల్లాపబ్బని భీమ్ నగర్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ @ సల్మాన్ అన్సారీ(26) లుగా గుర్తించి వారిపై NDPS యాక్ట్ 1985 ప్రకారం 8(c) r/w 20(b)(ii)(c) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ గంజాయి పట్టివేతకు కృషిచేసిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సరిలాల్ ఎస్సై స్వామి తో పాటు సిబ్బందిని టౌన్ ఏసీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed