Godavari : గోదావరి పరివాహక గ్రామాలను అప్రమత్తం చేసిన.. కలెక్టర్ సత్యప్రసాద్..

by Sumithra |
Godavari : గోదావరి పరివాహక గ్రామాలను అప్రమత్తం చేసిన.. కలెక్టర్ సత్యప్రసాద్..
X

దిశ, మెట్ పల్లి / ఇబ్రహీంపట్నం : గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, గ్రామ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి ఎగువన మహారాష్ట్రలోని భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాటిని దృష్టిలో పెట్టుకొని గోదావరి పరివాహక గ్రామస్తులు, రైతులు, మచ్చకారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అలాగే గత సంవత్సరం వరద ఎక్కడి వరకు వచ్చింది. ముంపునకు గురైన కుటుంబాలెన్నో వారిని ఎక్కడికి తరలించారనే విషయాలను అడిగి తెలుకున్నారు. మండల, గ్రామస్థాయి అధికారులు ఎప్పటికికప్పుడు గోదావరి ప్రవాహాన్ని పర్యవేక్షణ లో ఉండాలని కోరారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ ప్రసాద్, సెక్రటరీ మనోజ్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story