'దిశ ఎఫెక్ట్ ' గంగోని కుంటను పరిశీలించిన రెవెన్యూ అధికారులు..

by Disha Web Desk 23 |
దిశ ఎఫెక్ట్  గంగోని కుంటను పరిశీలించిన రెవెన్యూ అధికారులు..
X

దిశ,హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణ సమీపంలోని ఆక్రమణకు గురవుతున్న గంగోని కుంట శివారును గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గంగోని కుంట స్థలం కబ్జా అనే కథనం గత ఆదివారం దిశలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గురువారం కుంట శివారును పరిశీలించారు. కొందరు అక్రమార్కులు కుంట స్థలాన్ని కబ్జా చేసి గృహాలు నిర్మించుకున్నట్లు, మట్టితో నింపుతున్నట్లు గుర్తించారు. అనంతరం సర్వేయర్ సంపత్, ఆర్ ఐ శేఖర్ లు మాట్లాడుతూ... రెండు రోజుల్లో మున్సిపల్,ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి కుంట శివారుకు హద్దులు నిర్ణయం చేస్తామని తెలిపారు.

Next Story

Most Viewed