దిశ ఎఫెక్ట్... సైదాపూర్ పీహెచ్​సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్​ఓ

by Sridhar Babu |   ( Updated:2024-10-24 13:33:41.0  )
దిశ ఎఫెక్ట్... సైదాపూర్ పీహెచ్​సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్​ఓ
X

దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్​ఓ చందునాయక్ తనిఖీ చేశారు. దిశ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘ఈ మందులు మాకొద్దు’గడువు తీరిన మందులు అనే కథనానికి స్పందించిన డిప్యూటీ డీఎంహెచ్​ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించారు.

మందుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. అధికారులు పరిశీలించే సమయంలో నాలుగు గదుల్లో విచ్చలవిడిగా మందులు ఉండడం పట్ల ఫార్మసిస్ట్ సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వారిలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి రవీందర్ రెడ్డి, పారామెడికల్ ఆఫీసర్ శంకర్ నాయక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed