Collector Satya Prasad : వైద్యులు అందరూ అందుబాటులో ఉండాలి..

by Aamani |
Collector Satya Prasad : వైద్యులు అందరూ అందుబాటులో ఉండాలి..
X

దిశ,పెగడపల్లి : జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు అందరూ అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రోజున ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇన్ పేషంట్,ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించారు.అడ్మిట్ ఉన్న పేషంట్ల తో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.స్టాక్ రిజిస్టర్ ప్రకారం మందుల నిల్వ ఉందో లేదో సరి చూసి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సమి యుద్దిన్,ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీ ఓ మహేందర్, ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ నరేష్, డిప్యూటీ తహశీల్దార్ రాజ శేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed