పండించిన పంటలకు బోనస్ ఇస్తాం

by Sridhar Babu |
పండించిన పంటలకు బోనస్ ఇస్తాం
X

దిశ,సుల్తానాబాద్ : పండించిన పంటలకు బోనస్ ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కటింగ్ అనే పదానికే తావు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్ లో సన్న రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్టు తెలిపారు. రైతులు ఈ విషయంలో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదన్నారు.

గతంలో రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ నేతలు, నేడు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. వచ్చే యాసంగి నుంచి రైతు భరోసా ఎకరాకు రూ. 7,500 చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీ మాల, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నేతలు మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్, చిలుక సతీష్, పలువురు నాయకులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story