- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బిర్యానీ ఉడక లేదన్నందుకు కస్టమర్ పై దాడి.
దిశ, జగిత్యాల: భోజన ప్రియులకు మంచి నాణ్యమైన ఫుడ్ తో పాటు బెస్ట్ సర్వీస్ ను అందించాలని రెస్టారెంట్ యాజమాన్యాలు అనుకుంటాయి. అందులో భాగంగా కొందరు రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్స్ దగ్గర ఫుడ్ విషయంలో ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. అయితే జగిత్యాల లో మాత్రం ఫుడ్ బాగా లేదు అన్నందుకు ఓ కస్టమర్ ను రెస్టారెంట్ నిర్వాహకులు చితకబాదారు. దీంతో బాధితుడు డయల్ 100 ద్వారా పోలీసులను ఆశ్రయించాడు. ఆదివారం సాయంత్రం జాడి రమేష్ అనే వ్యక్తి బిర్యానీ కోసం పట్టణంలోని హరిహర రెస్టారెంట్ కి వచ్చాడు. అయితే తింటుండగా బిర్యానీ సరిగ్గా ఉడకలేదని అంతేకాకుండా పురుగులు ఉన్నట్లు గుర్తించి రెస్టారెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మమ్మల్నే అడుగుతావా అంటూ రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేసి కొట్టినట్టు బాధితుడు వాపోయాడు. అంతే కాకుండా తాను కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు రమేష్ ఆరోపించాడు. ఈ ఘటన పై బాధితుడు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.