పండగ సెలవుపై వచ్చిన వ్యక్తి.. అనంత లోకాలకు

by Mahesh |   ( Updated:2024-10-11 03:20:08.0  )
పండగ సెలవుపై వచ్చిన వ్యక్తి.. అనంత లోకాలకు
X

దిశ, కోరుట్ల రూరల్: ఉద్యోగరిత్యా దూర ప్రాంతంలో స్థిరపడిన ఓ యువకుడు దసరా పండగ సెలవులపై స్వస్థలానికి వచ్చి అనుకోని ప్రమాదం చోటు చేసుకోవడంతో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని కిషన్ రావుపల్లె గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణానికి చెందిన కడకుంట్ల సాయిరాం(27) అనే యువకుడు ముంబై నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా దసరా పండుగ కోసం గత రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై అయిలాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కిషన్ రావుపల్లె గ్రామంలో చెట్టుకు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దసరా పండుగ కోసం వచ్చిన సాయిరాం తిరిగిరాని లోకానికి వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed