ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఫ్యామిలీతో పవన్ కల్యాణ్.. రేర్ ఫొటో షేర్ చేసిన జనసేన

by Rajesh |   ( Updated:2024-06-23 09:10:59.0  )
ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఫ్యామిలీతో పవన్ కల్యాణ్.. రేర్ ఫొటో షేర్ చేసిన జనసేన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి ఒక్క సారిగా నేషనల్ వైడ్‌గా పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ అటెన్షన్ పొందారు. అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా, ఆద్యలతో కలిసి దిగిన ఓ రేర్ ఫొటోను జనసేన తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసి తర్వాత దిగిన ఓ అందమైన ఫొటో ఇది.. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయల్దేరే సమయంలో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడగా.. వాహనాన్ని రోడ్డు పక్కనే నిలిపి పవన్ ఫ్యామిలీతో సేద తీరారు. ఈ సందర్భంగా సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు అకీరానందన్, ఆద్యలతో పవన్ ఫొటో దిగారు అని జనసేన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే, జనసేన షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed