ఎన్నికల వేళ టీ-టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ టీ-టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీకి ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇన్ చార్జి జక్కలి ఐలయ్యయాదవ్ గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి ఆదివారం పంపారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి కోమటిరెడ్డి సాధరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపుతో పాటు భవిష్యత్తు ఉంటదని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం జరిగే యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కొత్తపాత తేడా లేకుండా ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు చేశానని, గత మూడు పర్యాయాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుపులో భాగస్వామ్యం అయ్యామన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో టీడీపీ భువనగిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మక్కెన అప్పారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Next Story

Most Viewed