మండుటెండలో ఒక్క బైక్ పై ఇంతమందా!?.. వీసీ సజ్జనార్ భావోద్వేగ ట్వీట్

by Disha Web Desk 5 |
మండుటెండలో ఒక్క బైక్ పై ఇంతమందా!?.. వీసీ సజ్జనార్ భావోద్వేగ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ కలుగుతుందంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఏడుగిరితో ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం! అంటూ ఓ వార్తపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన.. ఆ వార్తకు సంబందించిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై మండుటెండలో ఒక్క బైక్ పై ఇంత మందా!? ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం శ్రేయస్కరం కాదని సూచించారు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం భాదాకరం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి విషయాల పట్ల చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే ప్రజల్లో ఏమన్నా మార్పు రావచ్చు సార్ అని, ఆర్టీసీ బస్సుల్లో విద్యార్ధుల అవస్తలు కూడా అలాగే ఉన్నాయి. వాటిపై కూడా చర్యలు తీసుకొండి అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed