- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
18 ప్రాంతాలు.. 44 ఎకరాల స్వాధీనం.. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, చెరువు భూములను ఆక్రమించిన వారికి ముచ్చెమటలు పోయిస్తోంది హైడ్రా. నగరంలోని 18 ప్రాంతాల్లో దాదాపు 44 ఎకరాల భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్, ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనం, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా, దానం నాగేందర్ ప్రధాన అనుచరుని భవనం నందగిరిహిల్స్ లో, చింతల్ బీఆర్ఎస్ లీడర్ రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పల్లం రాజు బంధువుల భవనాలను ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసింది. మరిన్ని కూల్చివేతలు జరుగుతాయని, ఆక్రమార్కులు ఎవ్వరైనా వదిలి పెట్టేది లేదు అని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.