ప్రముఖ నటుడికి హైడ్రా నోటీసులు..కూల్చేస్తామని వార్నింగ్!

by Jakkula Mamatha |
ప్రముఖ నటుడికి హైడ్రా నోటీసులు..కూల్చేస్తామని వార్నింగ్!
X

దిశ,వెబ్‌డెస్క్:హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం శ్రీకారం చుట్టినటువంటి హైడ్రా తన దూకుడును కొనసాగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్(N Convention)తో పాటు పలు అక్రమ కట్టడాలను కూల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు, వ్యాపారవేత్త(businessman) మురళి మోహన్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి సంస్థలకు హైడ్రా నోటీసులు(Notices) జారీ చేసింది. ఫైనాన్సియల్(Financial) డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రంగలాల్ కుంట చెరువు ఎస్టీఎల్, ఇంకా బఫర్ జోన్‌లో నిర్మించిన కట్టడాలను(buildings) తొలగించాలని జయభేరీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇక భగీరథ(Bhagiratha) చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు FTL బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను వేయడం పై పూర్తి స్థాయి విచారణ(investigation) జరపనున్నాట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed