జూపార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవం..

by Nagam Mallesh |
జూపార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవం..
X

దిశ, చార్మినార్ః నెహ్రూ జూలాజికల్​ పార్కులో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జూపార్కులోని ఏనుగుల కోసం సలాడ్​, చెరుకు ముక్కలు, రాగి, రైస్​, పండ్లు, కీర, క్యారెట్, కూరగాయలు, మొలకలు, మొక్కజొన్నలు, బెల్లంతో ప్రత్యేకంగా తయారుచేయించిన కేక్​తో పాటు కొబ్బరి, పచ్చిగడ్డి, అరటి పండ్లును ఆహారంగా అందించారు. ఈ సందర్భంగా వనజ, ఆశ, సీత, విజయ్​ అనే నాలుగు ఆసియా ఏనుగుల ముందు కేక్​ను కట్​ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ జూలాజికల్​ పార్కు క్యూరేటర్​ డాక్టర్​ సునీల్​ఎస్​.హిరేమత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూరేటర్​ డాక్టర్​ సునీల్​ఎస్​.హిరేమత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూ డిప్యూటి క్యూరేటర్​ ఎ.నాగమణి, వెటర్నరీ డిప్యూటి డైరెక్టర్​ డాక్టర్​ ఎం. ఎ హకీం, అసిస్టెంట్​ క్యూరేటర్లు​ అమృతమ్మ, లక్ష్మణ్​ బాణావట్​, విష్ణువర్థన్​, డిప్యూటి ఆర్​ఓ డాక్టర్​ డాక్టర్​ బాబురావు, కె.మోహన్​, గణేష్​, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed