వాహనాల తనిఖీలలో రూ. రెండు లక్షల 50 వేలు పట్టివేత

by Sridhar Babu |   ( Updated:2024-03-21 12:00:27.0  )
వాహనాల తనిఖీలలో రూ. రెండు లక్షల 50 వేలు పట్టివేత
X

దిశ, నాగిరెడ్డిపేట్ : పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మండలంలోని పోచారం గ్రామంలో బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గురువారం వాహనాల తనిఖీలలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రెండు లక్షల 50 వేల రూపాయలను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కౌడిపల్లి మండలం బూరుగు గడ్డ గ్రామానికి చెందిన జి. కుమార్ అనే వ్యక్తి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా 2 లక్షల రూపాయలు

ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్నాడని, అలాగే వర్ధన్నపేట మండలం బొక్కల గూడెం గ్రామానికి చెందిన ఎండి. షాన్ అనే వ్యక్తి 50 వేల ఒక వంద రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని డబ్బులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులను తరలించినట్లయితే స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రాజు, ఏఎస్ఐ ఉమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story