- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హజ్రత్ బిబి ఫాతిమా సమాధిని పునరుద్ధరించాలి
దిశ, ముషీరాబాద్: సౌదీ అరేబియాలో కూల్చివేసిన హజ్రత్ బిబి ఫాతిమా సమాధులను వెంటనే పునర్నిర్మించాలని ఆల్ బకి ఆర్గనైజేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫాతిమా సమాధులను పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ అల్ బకీ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ బకి సంస్థ ప్రతినిధులు డాక్టర్ షఫీ బాదర్ మౌలానా ఫయాజ్, మౌలానా హైదర్ జహీదా, మౌలానా అన్నాస్ రజ్వి, ఫిరాసత్ అలీ బాక్రి, సయ్యద్ అలీ హుస్సేన్, జహీది మీర్ సోహెల్ రజాక్, ముస్తఫా సాదిక్, జావేద్ హకీం బేగ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.
1924 లో అప్పటి ప్రభుత్వం సమాధులను కూల్చివేసిందని వీటిని పునరుద్ధరించాలని గత శతాబ్ద కాలంగా అనేక సంస్థలు పోరాటం సాగిస్తున్నాయని అన్నారు. నాటి నుంచిమరమ్మతులు చేపట్టకుండా సమాధి వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భారత ప్రభుత్వం సౌదీ అరేబియా తో చర్చించి సమాధిని పునర్ నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా సౌదీ అరేబియా ప్రభుత్వం ఫాతిమా సమాధిని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ముస్లింలు పాల్గొన్నారు.