- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పక్కా
దిశ, సికింద్రాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పక్కా అని సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు నాలుగు వందల సీట్లతో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెట్టుగూడ, అడ్డగుట్ట, లాలాగూడ రైల్వే వర్క్ షాప్ వద్ద కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లాలగూడ రైల్వే వర్క్ షాప్ వద్ద గేట్ మీటింగ్లో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన మాట్లాడారు.
నరేంద్ర మోడీ సమర్థవంతమైన పరిపాలనను రైల్వే ఉద్యోగులు అందరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక ఖాయమని చెప్పారు. తనను సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అడ్డగుట్ట పరిధిలోని సాయి నగర్ చంద్రశేఖర్ నగర్ తదితర బస్తీలో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. స్వయంగా ఓటర్లను కలుసుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.