బీఆర్ఎస్ కు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం గుడ్ బై

by Sridhar Babu |
బీఆర్ఎస్ కు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం గుడ్ బై
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : బీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన గతంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తన రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు పంపినట్లు తెలిపారు.

తన అనుచరులు, అభిమానులతో చర్చంచి ఏ పార్టీలో చేరాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇన్ని రోజులు తనకు సహకరించి తనతో నడిచిన హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed