ఓయూలో ఫ్లెక్సీ వివాదం.. విద్యార్థుల మధ్య ఘర్షణ

by Aamani |
ఓయూలో ఫ్లెక్సీ వివాదం.. విద్యార్థుల  మధ్య ఘర్షణ
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లో ఫ్లెక్సీ ల వివాదం విద్యార్థి నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. క్యాంపస్ లో నిర్వహించిన గణేష్ నిమజ్జనం ర్యాలీలో ఏబీవీపీ కాంగ్రెస్, టిఎస్ఏ విద్యార్థి నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు చందు, టీఎస్ఏ విద్యార్థి నాయకుడు ఎన్ ఎం శ్రీకాంత్ లకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు చందు, శ్రీకాంత్ లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్యాంపస్ లో తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏబీవీపీ నాయకులు చింపారని కాంగ్రెస్ విద్యార్థి నాయకులు చెబుతుంటే, తమ ఫ్లెక్సీలను కాంగ్రెస్ విద్యార్థి నాయకులు చింపుతుంటే అడ్డుకున్నామని ఏబీవీపీ నాయకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed