క్రికెటర్ సిరాజుద్దీన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు...

by Kalyani |
క్రికెటర్ సిరాజుద్దీన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు...
X

దిశ,కార్వాన్ : టి20 మినీ వరల్డ్ కప్ 2024 భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గెలిచిన భారత్ క్రికెటర్లు గురువారం ముంబాయి కు చేరుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. అయితే మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వద్ద క్రికెట్ అభిమానులు సిరాజుకు ఘనంగా స్వాగతం పలికారు. కాగా అక్కడ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా ఫస్ట్ లాన్సర్ లోని ఈదుగా గ్రౌండ్ కు చేరుకొని అక్కడ సన్మాన కార్యక్రమం తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి, అక్కడి నుంచి రాత్రి బంజర హిల్స్ జహీరా నగర్ లోని తన ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని సిరాజుకు సన్మాన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా రావడంతో పోలీసులు జనాలను అదుపు చేశారు.

Next Story

Most Viewed