రాష్ట్రంలో బీజేపీ విజయం తథ్యం : ఎంపీ లక్ష్మణ్

by Disha Web Desk 11 |
రాష్ట్రంలో బీజేపీ విజయం తథ్యం : ఎంపీ లక్ష్మణ్
X

దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలో బీజేపీ విజయం తథ్యమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని సబర్మతి నగర్, అరుంధతి నగర్, దోభీఘాట్ బస్తీ, వి.వి.గిరి నగర్, ఆంధ్ర కేఫ్ చౌరస్తా, శాంతి యువజన సంఘం తో పాటు పలు బస్తీల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర నిర్వహించారు. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు పావని, బిజెపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం జరిపారు. అనంతరం డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ యావత్ ప్రజానీకం ముక్త కంఠంతో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా చూసేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

గత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన అన్యాయాన్ని తిప్పి కొట్టి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా ఇంకా వారు అన్ని గ్యారెంటిలు అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికే కరెంటు కోతలు, నీటి ఎద్దడి తో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు తెలిపారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి అంశాలను ప్రస్తావించకుండా, రాజ్యాంగం రద్ధని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని బూటకపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో వారి నాయకులు రిజర్వేషన్ల పట్ల ప్రజలకు చేసిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.

ఇతర పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని తెలిపారు. మరోసారి బిజెపి తప్పక విజయం సాధిస్తుందని, మోదీ హ్యాట్రిక్ ప్రధాని కావడంలో తిరుగులేదని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూస రాజు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏనుగు వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీకాంత్, దామోదర్, ఉమేష్, ముత్యాలు, ఆకుల సురేందర్, విజయలక్ష్మి, సంధ్యారాణి, పూర్ణ తదితర మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed