సత్వ నెక్లెస్ ప్రైడ్ లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Y.Nagarani |
సత్వ నెక్లెస్ ప్రైడ్ లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, ముషీరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు 40 కి పైగా ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అనేక కాలనీలలో పలు కామ్యూనిటీహాల్లలో, హౌసింగ్ కాంప్లెక్స్ ల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కవాడిగూడ ప్రధాన దారిలోని సత్వ నెక్లెస్ ప్రైడ్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంతో మన లైఫ్ స్టయిల్ లో మానసిక ఒత్తిడితో అనేక మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసన్ని పెంపొధించాలనే లక్ష్యంలో భాగంగానే ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మన జీవన విధానంలో భాగమైన యోగాను అందరూ సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed