విషాదం.. రైలు కింద పడి హోంగార్డ్ ఆత్మహత్య

by Rajesh |
విషాదం.. రైలు కింద పడి హోంగార్డ్ ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే హోంగార్డు సంపత్(43) శనివారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి హోంగార్డు సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. శనివారం వేకువజామున విధులకు వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి బయటకు వచ్చిన సంపత్ 4 గంటల ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎల్లమ్మగుట్టకు చెందిన సంపత్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే సంపత్ గత కొంత అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు, దాంతో పాటు అప్పుల బాధ తీవ్రం కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబీకులు అందించిన సమాచారం మేరకు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed